అజిత్ పవర్ ప్రయాణిస్తున్న విమానం కుప్ప కూలింది! ఐదుగురు దుర్మరణం... ప్రమాదానికి కారణం ఏంటి?

మహారాష్ట్రలో విమాన ప్రమాదం, అజిత్ పవార్ మృతి అంటూ వైరల్ అవుతున్న వార్తలపై నిజమెంటి? అధికారిక సమాచారం లేకుండా వ్యాపిస్తున్న ప్రచారంపై ఫోర్త్ లైన్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్.

flnfln
Jan 28, 2026 - 10:28
 0  4
అజిత్ పవర్ ప్రయాణిస్తున్న విమానం కుప్ప కూలింది! ఐదుగురు దుర్మరణం... ప్రమాదానికి కారణం ఏంటి?

* ఒక్క ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది 

* మహారాష్ట్రలో ఘోరమైన విమాన ప్రమాదం 

* మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, భద్రత సిబ్బంది, పైలెట్ 

* అక్కడికక్కడే అందరూ మరణించారు. 

* ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది? దానికి కారణాలేంటి?

మహారాష్ట్ర ప్రతినిధి ఫోర్త్ లైన్ న్యూస్ : ఒక మనిషి ఎప్పుడు పుడతాడు, ఎప్పుడో చనిపోతాడు ఎవరికి తెలియదు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ ప్రమాదం గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు ఆయన ప్రయాణిస్తున్న ఆ విమానం బారామతి సమయంలో కుప్పకూలినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రయాణంలో దాదాపు ఐదుగురు మరణించినట్టు తెలుస్తుంది. అజిత్ పవర్ తో పాటు, పైలట్లు మరియు భద్రత సిబ్బంది ఉన్నట్టుగా తెలిపారు. 

అజిత్ పవర్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేయబడిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం ముంబై నుంచి భారామతికి బయలుదేరారు. ఎనిమిది గంటలకు ముంబై నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం, గంట తర్వాత బారామతి ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తుంది. ప్రమాదం వాటిల్లిన వెంటనే విమానంలో ఉన్న వారందరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వర్గాలు ధ్రువీకరించాయి.

ప్రమాదం జరిగిన వెంటనే విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పెద్దమంట, దట్టమైన పొగ వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ ను, సహా అక్క బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ఈ వార్త మహారాష్ట్ర రాజకీయ వర్గాలు ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాయి. రాజకీయ వర్గాలలో అధికారులు, మరణించిన వారికి సంతాపం తెలుపుతున్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.