అతడు బతికి ఉంటే నేనే చంపేసేదాన్ని: బాలిక తల్లి
మదనపల్లెలో బాలికపై జరిగిన దారుణ ఘటనలో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకోవడంపై మృతురాలి తల్లి తీవ్రంగా స్పందించారు. “బతికి ఉంటే నేనే చంపేసేదాన్ని” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై జరిగిన దారుణ హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మృతురాలి తల్లి తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. నిందితుడు బతికి ఉంటే తానే చంపేసేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “నా బిడ్డ చివరి క్షణాల్లో ఎంత భయంతో, బాధతో పోరాడిందో ఊహించుకుంటే గుండె పగిలిపోతోంది. ఇలాంటి మానసిక వికృతులకు చావే సరైన శిక్ష” అని మీడియాతో మాట్లాడిన సందర్భంగా తెలిపారు.
కులవర్ధన్ మరణంతో తన కూతురి ఆత్మకు కొంతైనా శాంతి లభిస్తుందనే భావన కలుగుతోందని ఆమె చెప్పారు. అయితే తన కుటుంబానికి జరిగిన నష్టం ఎప్పటికీ భర్తీ కాదని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఇక నిందితుడు ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకు వచ్చిన వెంటనే పట్టణంలో కొంతమంది ప్రజలు ఊరట వ్యక్తం చేశారు. కేసు దారుణం వల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొన్న నేపథ్యంలో, నిందితుడి మరణంతో కొంత ఉపశమనం కలిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0