ఉమ్మడి ఖమ్మంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లిలో మాట్లాడుతూ మూడు రంగుల జెండా రెపరెపలాడుతుందని తెలిపారు.
* ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్.
* సత్తుపల్లి లో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి
* మరల కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని ధీమా
* మూడు రంగుల జెండా రెపరెపలాడుతుంది.
ఖమ్మం ఫోర్త్ లైన్ న్యూస్ ప్రతినిధి : కాంగ్రెస్ జెండా నే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగురుతుంది: పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేస్తుంది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. గురువారం సత్తుపల్లిలో మంత్రి మాట్లాడుతూ..
గత ప్రభుత్వంలో ప్రజలు ఎంతో విసిగిపోయారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పరిపాలనను ఆశీర్వదిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విపక్షాల ఎత్తుగడలు ఏమి పనిచేయవు, అన్ని చోట్ల మూడు రంగుల జెండా రెపరెపలాడుతుంది అని అయినా స్పష్టం చేశారు. మరల ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుంది అని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0