ఇంట్లో తండ్రి మృతదేహం.. బాధలోనే ఇంటర్ పరీక్షకు కొడుకు

తండ్రి మృతి చెందిన బాధ మధ్యే నెల్లూరులో ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షకు హాజరైన భావోద్వేగ ఘటన. బంధువులు, లెక్చరర్ల ప్రోత్సాహంతో పరీక్ష రాశాడు.

flnfln
Feb 23, 2026 - 11:53
 0  5
ఇంట్లో తండ్రి మృతదేహం.. బాధలోనే ఇంటర్ పరీక్షకు కొడుకు

ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తండ్రి మరణం అనే తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంటూనే ఓ విద్యార్థి తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షకు హాజరయ్యాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

సంగం మండల కేంద్రానికి చెందిన విద్యార్థి కందం రాంసాయి తండ్రి నిన్న రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయిన సమయంలోనే మరోవైపు రాంసాయికి ఇంటర్ పరీక్ష ఉండటంతో తీవ్ర అయోమయం నెలకొంది. ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగా పరీక్షకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది.

ఈ కష్ట సమయంలో బంధువులు, కాలేజీ లెక్చరర్లు రాంసాయికి ధైర్యం చెప్పారు. చదువు భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని, తండ్రి కూడా అదే కోరుకునేవారని ప్రోత్సహించారు. వారి మాటలు ధైర్యం ఇచ్చడంతో రాంసాయి తన బాధను మనసులో పెట్టుకుని పరీక్ష రాయడానికి వెళ్లాడు.

పరీక్ష పూర్తైన తర్వాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, ఉపాధ్యాయులు విద్యార్థి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. తీవ్ర విషాదంలోనూ బాధ్యతను గుర్తించి పరీక్షకు హాజరుకావడం ఎంతో గొప్ప విషయమని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా లక్ష్యాన్ని వదలకూడదనే సందేశాన్ని అందిస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.