కర్నూలు బస్సు ప్రమాదం.. ఒక్క నిర్లక్ష్యం 19 ప్రాణాలు తీసింది
కర్నూలు బస్సు ప్రమాదంపై కొత్త వివరాలు బయటపడ్డాయి. 19 వాహనాలు బైకును తప్పించుకున్నా, చివరగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఒక్క నిర్లక్ష్యం 19 ప్రాణాలను తీసింది – Fourth Line News.
కర్నూలు, ఫోర్త్ లైన్ న్యూస్:
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి 2.45 గంటల సమయంలో బైక్ నడిపిన శివశంకర్ డివైడర్ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ బైకు రోడ్డు మధ్యలో పడిపోయింది.
దానికి కేవలం పది నిమిషాల తర్వాత, సుమారు 2.55 గంటలకు వెళ్తున్న వీ కావేరీ బస్సు ఆ బైకును ఢీకొట్టింది. అయితే ఈలోగా 19 వాహనాలు అదే మార్గంలో వెళ్లి కూడా ఆ బైకును తప్పించుకున్నాయి. కానీ బస్సు డ్రైవర్ మాత్రం దాన్ని గుర్తించలేకపోయాడు.
ఇది డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక దృష్టిఅభావమా? అనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒక్కరు ఆ బైకును రోడ్డు పక్కకు జరిపి ఉంటే, 19 ప్రాణాలు కాపాడేవి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0