ఖమ్మం దుర్ఘటన: లారీని ఢీకొట్టి మహిళ మృతి – సత్తుపల్లి వద్ద విషాదం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళ లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందింది. పూర్తి వివరాలు Fourth Line Newsలో చదవండి.
ఖమ్మం: ఘోరం.. స్కూటీపైనే మహిళ మృతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం తాళ్లమడ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది.
సత్తుపల్లికి చెందిన మోరంపూడి స్వర్ణలత (45) గంగారం నుంచి స్కూటీపై సత్తుపల్లికి తిరిగి వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. స్కూటీతో సహా లారీ కిందకు దూసుకుపోయిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సూచన మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0