టికెట్ లేని ప్రయాణికులపై రైల్వే కొరడా – ఒకేరోజు రూ. కోటి జరిమానా వసూలు

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక తనిఖీల్లో 16 వేల మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుని రూ.1.08 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఇది SCR చరిత్రలో రికార్డు.

flnfln
Oct 15, 2025 - 08:43
 0  3
టికెట్ లేని ప్రయాణికులపై రైల్వే కొరడా – ఒకేరోజు రూ. కోటి జరిమానా వసూలు

Main headlines : 

1. టికెట్ లేని ప్రయాణికులపై సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కఠిన చర్యలు చేపట్టింది.

2. జోన్ పరిధిలో జరిగిన ప్రత్యేక తనిఖీల్లో 16 వేల మంది టికెట్ లేని ప్రయాణికులు పట్టుబడ్డారు.

3. సాధారణంగా రోజుకు సగటున ₹47 లక్షల జరిమానాలు వసూలు అవుతుంటే, అక్టోబర్ 13న రికార్డు స్థాయిలో ₹1.08 కోట్లు వసూలు చేశారు.

4. విభాగాల వారీగా – విజయవాడ డివిజన్ ₹36.91 లక్షలు, గుంతకల్లు ₹28 లక్షలు, సికింద్రాబాద్ ₹27.9 లక్షలు, గుంటూరు ₹6.46 లక్షలు, హైదరాబాద్ ₹4.6 లక్షలు, నాదెండ్ ₹4.08 లక్షలు వసూలయ్యాయి.

5. ఇది SCR చరిత్రలో ఒకేరోజు వసూలైన అత్యధిక జరిమానాగా నమోదైంది.

6. టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా విధించబడవచ్చని అధికారులు హెచ్చరించారు.

పూర్తి వివరాల్లోనికి వస్తే ; 

టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించే వారిపై సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) కఠిన చర్యలు చేపట్టింది. సోమవారం జోన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16 వేల మంది టికెట్ లేని ప్రయాణికులు దొరికారు.

రోజువారీగా జరిమానాల రూపంలో సగటున ₹47 లక్షలు వసూలు అవుతుండగా, అక్టోబర్ 13న మాత్రం రికార్డు స్థాయిలో ₹1.08 కోట్ల జరిమానా వసూలు చేయడం SCR చరిత్రలో తొలిసారి జరిగింది.

విభాగాల వారీగా పరిశీలిస్తే – విజయవాడ డివిజన్ ₹36.91 లక్షలు, గుంతకల్లు డివిజన్ ₹28 లక్షలు, సికింద్రాబాద్ ₹27.9 లక్షలు, గుంటూరు ₹6.46 లక్షలు, హైదరాబాద్ ₹4.6 లక్షలు, నాదెండ్ ₹4.08 లక్షలు జరిమానా వసూలు చేశారు.

రైల్వే అధికారులు టికెట్ లేకుండా ప్రయాణించడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. ఇలాంటి వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని స్పష్టం చశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.