సత్య హీరోగా రితేష్ రానా కొత్త చిత్రం
రితేష్ రానా దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా, మిస్ యూనివర్స్ రియా సింఘా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమవుతున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం పక్కా ఫన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది.
‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా-2’ సినిమాలతో దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్ర వేసిన రితేష్ రానా, తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న ఈ నాలుగో చిత్రంలో ప్రముఖ కమెడియన్ సత్య హీరోగా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. పక్కా ఎంటర్టైన్మెంట్తో నిండిన ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఘనమైన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.
క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పూయించే వినోదభరిత చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
ఈ సినిమాతో మిస్ యూనివర్స్ రియా సింఘా తెలుగుతెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సత్య సరసన ఆమె ప్రధాన నాయికగా కనిపించనున్నారు. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటి వరకు రితేష్ రానా తీసిన చిత్రాల మాదిరిగానే, ఈ సినిమా కూడా పక్కా ఎంటర్టైన్మెంట్తో నిండిన ఫన్రైడ్గా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను సురేష్ సారంగం నిర్వహిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0