పాకిస్తాన్లో పెళ్లి వేడుకల్లో ఉగ్రవాదుల దాడి.. ఆత్మాహుతి పేలుడుతో ..
పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో పెళ్లి వేడుకల మధ్యలో ఆత్మాహుతి బాంబర్ దాడి జరిపాడు. ఈ ఘటనలో 7 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి వెనుక TTP పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
* పాకిస్తాన్లోనే పెళ్లి వేడుకలలో ఉగ్రవాదులు కలకలం
* ఆత్మాహుతి బాంబర్ , పెళ్లిలో పందిరి చెల్లా చెదిరింది
* ఏడుగురు అక్కడికక్కడే మరణించారు, 25 మంది కి గాయాలు
* ఏ ఉగ్రవాది సంస్థ మేమే చేశామని ప్రకటన లేదు
* పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు
fourth line news : ఈ ఉగ్రవాదులు వాళ్లకి ఇంకే పని ఉండదేమో ! పడితే పరుగు దేశాల పైన పడతారు! లేదంటే వాళ్ళ దేశం మీద పడతారు! ఎందుకీ మాట అన్నాను కింద ఉన్న సమాచారం అంతటిని చదవండి: ఉగ్రవాదులు ఏకంగా పాకిస్తాన్లో జరుగుతున్న పెళ్లి వేడుకల పై ఆత్మాహుతి దాడి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించ, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఖైబర్ పఖుంఖ్వా ప్రావిన్స్ లో చోటుచేసుకుంది.
ఈ ప్రమాదం డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ప్రభుత్వ అనుకూల శాంతి కమిటీ నాయకుడిగా పేరున నూర్ ఆలం మెహసూద్ ఇంట్లో వివాహ వేడుకల్లో జరుగుతూ ఉండగా. బంధు మిత్రులందరికీ సంతోషంగా డాన్స్ చేస్తూ, ఆనందంగా ఉన్న సమయమున అదే సమయము అని భావించి ఓ ఆత్మాహుతి బాంబర్, జనసమూహంలోకి చొరబడి తనను తాను పేల్చుకున్నాడు. ఆ పేలుడుతో పెళ్లి పందిరి అంతా ఒక్కసారే భయభ్రాంతుల వాతావరణం లోనికి వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది అని ఆలోచించే లేపే తీరని నష్టం వాటిల్లింది.
ఈ దాడి చేసింది మేమే అని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సమస్త ప్రకటించుకోలేదు. అయితే పోలీసులు అనుమానం ప్రకారం, ఆ ప్రాంతంలో తరచు దాడులకు పాల్పడే తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) పనే అయి ఉంటుంది అని. ఈ సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించాయి. అయితే గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది అని మృతుల సంఖ్య పెరిగి అవకాశము ఉంది అని వైద్యులు తెలి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఘటన పాకిస్తాన్ అంతా స్ప్రెడ్ అయింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0