నిప్పులా మంటలేస్తున్న నేపాల్ – హింస, కర్ప్యూ, ఖైదీల పారిపోవడం

నేపాల్‌లో విద్యార్థి ఉద్యమం హింసాత్మకంగా మారి 33 మంది మృతి చెందగా, వెయ్యికి పైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సైన్యం కర్ప్యూ విధించింది. 13,000 మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు. భారతీయులు సహా వందలాది విదేశీయులు చిక్కుకుని సురక్షిత రవాణా కోసం ఎదురుచూస్తున్నారు.

flnfln
Sep 11, 2025 - 09:26
Sep 11, 2025 - 09:27
 0  1
నిప్పులా మంటలేస్తున్న నేపాల్ – హింస, కర్ప్యూ, ఖైదీల పారిపోవడం

* హింసాత్మక ఘటనల్లో 30కి పెరిగిన మరణాల సంఖ్య

* 1,033 మందికి గాయాలు

* సైన్యం పహారాలో కొనసాగుతున్న కర్చ్యూ.

* యాత్రలకు వెళ్లి నేపాల్లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయులు

* బద్దలైన జైళ్లు... పారిపోయిన 13,000 మంది ఖైదీలు

* ఆర్మీ, జెన్ జెడ్ మధ్య ముగిసిన తొలిద ఫా చర్చలు

హిమా బయాల నేపాల్ సోషల్మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం -ఉగ్రరూపం దాల్చి డజన్లమందిని పొట్టనబెట్టుకుని బుధవారానికి చాలామటుకు శాంతించింది కానీ బయటిశక్తుల విధ్వంసకర ఉద్యమ ఎగబోతతో నివురుగప్పిన నిప్పులా తయారై తాత్కాలిక ప్రభు త్వానికి కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. దాం తో సైన్యంరంగంలోకి దిగి దేశవ్యాప్త కర్ప్యూను కరి నంగా అమలుచేస్తోంది. ఉద్యమబాట వీడి చర్చల పథంలో సాగాలంటూ విద్యార్థి సంఘాలకు దేశాధ్యక్షుడు రామచంద్ర పాడెల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో 'జెన్ జెడ్ నేపాల్ ' విద్యార్థి సంఘం ప్రతి విధులు నేపాల్ సైన్యంతో బుధవారం తొలిదఫా చర్చలు జరిపారు.

 రెండు గంటలపాటు చర్చించిన ఎలాంటి ఏకాభిప్రాయం కుదర్లేదు మరోమారు చర్చలు జరపనున్నారు. నేపాల్ మాజీ మహిళా చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ, కార్మండు మేయర్ బాలేం ద్రషా, మాజీ విద్యుత్ బోర్డ్ సీఈఓ కుల్మాన్ ఘిసిం గ్లలో ఏవరో ఒకరి సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని విద్యార్థులు డిమాండ్ స్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశాన్ని నిరసనోద్యమ అగ్నికీలల్లోకి తోసేశారన్న ఆరోపణలను విద్యా ర్థులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు శాంతియుతం గా పోరాటంచేస్తుంటే బయటిశక్తులు దూరి విధ్వం నం సృష్టించాయని స్పష్టంచేశాయి.

ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేసినా ఆందోళనలు చల్లారకపోవడంతో సైన్యం మంగళవారం అర్ధరాత్రి రంగంలోకి దిగింది అత్యంత సమస్యాత్మ కంగా మారిన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసు కుంది. దేశవ్యాప్త కర్వ్యూను విధించింది. అయితే హింసాత్మక ఘటనల్లో మరణాల సంఖ్యబుధవారా నికి 33కు పెరిగింది. 1,033 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం దాకా కఠిన ఆంక్షలను ఆం దరూ పాటించాలని, లూటీ, దోపిడీ వంటివి పున రావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యాత్ర, పర్యటన కోసమొచ్చి చిక్కుకుపోయిన విదేశీయులను భద్రం గా స్వదేశాలకు తరలించే ప్రక్రియ మొదలెడ తామని ఆర్మీ భరోసా ఇచ్చింది. ఆలోపు విదేశీ పర్యాటకులు, యాత్రికులకు తగు సాయం చేయాలని హోటళ్లు, టూరిజం సంస్థలను ఆర్మీ ఆదేశించింది. కార్మండులో దుకాణాలు కొల్లగొట్టిన అల్లరిమూకల సభ్యులను ఆర్మీ అరెస్ట్చేసింది. వారి నుంచి భారీ ఎత్తున నగదు, 31 ఆయుధాలు, విలువైన వస్తువులను స్వాధీనంచేసుకుంది. నేపా ల్లో తాజా పరిస్థితిని గమనిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ బుధవారం చెప్పారు. వాటిల్లోని 13,000 మందికిపైగా ఖైదీలు పరార య్యారు. ఢిల్లీబజార్ జైలు, చిత్వాన్, నఖూ, ఝం ప్కా, కందన్పూర్, జలేశ్వర్, కస్కీ, డాంగ్, జుమ్లా, సోలూఖుంబు గౌర్, బజాంగ్లోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయారు. ఆకొద్ది సమయంలో పారి పోవడం సాధ్యంకాని ఖైదీలు కారాగారాల్లో ఘర్షణ లకు దిగుతున్నారు.

పశ్చిమ నేపాల్లోని బాంకే ప్రాంతంలోని నౌబస్తా ప్రాంతీయ జైలు పరిధిలోని బాలనేరస్తుల కేంద్రంలో కొందరు జైలువార్షన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు తెగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు బాలలు చనిపోయారు "కొన్ని జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలను సైన్యం ఎలా గోలా వెతికి పట్టుకుని మళ్లీ జైల్లో పడేసింది.

దయచేసి నన్ను భారతకు పంపేయండి

పొలారా పట్టణంలో వాలీబాల్ లీగ్ మ్యాచ్ల కోసం వచ్చిన భారతీయ మహిళ ఉపస్థ గిల్ అందోళనకారుల దాడి నుంచి తప్పించుకున్నారు. తనను రక్షించాలని, స్వదే శానికి పంపించాలని భారతసర్కార్ను వేడు కుంటూ ఆమె ఇన్స్టా గ్రామ్లో ఒక వీడియో పోస్ట్చేశారు. "మ్యాచ్ కోసం ఇక్కడికొచ్చా. హోటల్ స్సాలో ఉన్నప్పుడు ఆందోళనకారులు పెద్ద కర్రలతో వెంటబడ్డారు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్నా. కానీ నా లగేజ్ మొత్తం హోటల్ లోనే ఉండిపోయింది. ఆ హోట లకు నిరసనకారులు నిప్పుపెట్టి కాల్చేశారు. దయచేసి నన్ను భారత్ కు పంపేయండి. 

 

రోడ్లు మీద ఎక్కడ చూసిన మంటలే చెలరేగు తున్నాయి. ఇక్కడ చారుణ పరిస్థితులున్నా యి"అని ఆమె వీడియోలో వాపోయారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్-మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్త రాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా పలు, రాష్ట్రాలకు చెందిన చాలా మంది పర్యాటకులు, నేపాల్లో చిక్కుకుపోయి సురక్షిత తిరుగుప్ర యాణం కోసం ప్రభుత్వ సాయం ఆర్థిస్తున్నా రు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నేపా ల్ అధికారవర్గాలతో చర్చలు జరువుతున్నాయి. అయితే ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల్లో భారతీయులను వెనక్కి రప్పిస్తామని పౌరవి మాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఎక్స్ లో చెప్పడం జరిగింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.