పెళ్లి వేడుకల నుంచి తిరిగివస్తుండగా ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, 8 మంది మృతి
నేపాల్లో పెళ్లి వేడుకల నుంచి తిరిగివస్తుండగా బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 45 మందికి పైగా గాయాలు కాగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
* పెళ్లిలో సంతోషంగా గడిపి తిరిగి వస్తుండగా ప్రమాదం!
* బస్సు లోయలో పడిపోగా 8 మంది అక్కడికక్కడే మృతి
* బస్సులో మొత్తం 60 మంది ఉన్నట్టు తెలుస్తుంది
* ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే !
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : పెళ్లి అంటేనే ఇరు కుటుంబాల్లో సంతోషం ఆనందం, అని ఈ కుటుంబాలలో మాత్రం తీరని లోటు, చెప్పుకోలేని బాధ. నేపాల్ లోని బైతాడి జిల్లాలో రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వారందరూ పెళ్లి వేడుకలు ముగించుకొని తిరిగి వస్తుండగా, బైతాడి జిల్లాలోని పుర్చౌడి మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సుమారుగా ఆ బస్సులో 60 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఏ బస్సు కొండ ప్రాంతంలోని వంకర మార్గంలో ప్రయాణిస్తూ నియంత్రణ కోల్పోయి లోయలోనికి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో 45 మందికి పైగా గాయపడగా, వారిలో 16 మంది పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే వారందరిని సమీప ఆసుపత్రివి తరలించారు. వధూవరులు వేరే వాహనంలో ప్రయాణిస్తుండటంతో పరుసుర క్షేతంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నేపాల్ సైన్యం, పోలీసుల యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టి శతగాత్రులను బయటికి తీశారు. అందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగే కుటుంబంలో తీరని బాధ చోటుచేసుకుంది
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0