ఇరాన్లో ఏం జరుగుతోంది? భారతీయులు వెంటనే వెళ్లిపోవాలన్న సూచన వెనుక కారణమేంటి?
ఇరాన్లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న భారతీయులు వెంటనే దేశం విడిచిపెట్టాలని ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎంబసీతో సంప్రదింపులో ఉండాలని సూచించింది.
* ఇరాన్లో జరుగుతున్న నిరసనలు ఇప్పుడు దేశమంతా పాకాయి
* భారతీయులను వెనక్కి రమ్మని పిలుపు
*ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వచ్చేయాలి పిలుపు
* ఎలాంటి సహకారం కావాలి అన్న : mailto:cons.tehran@mea.gov.in
* పూర్తి వివరాల్లోనికి వెళితే:
fourth line news: ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు చేసింది. భద్రతా పరిస్థితులు సురక్షితంగా లేవని పేర్కొంటూ, అక్కడున్న భారతీయులు వీలైనంత త్వరగా ఇరాన్ను విడిచిపెట్టాలని ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది.
ఇరాన్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా సాధారణ జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోందని ఎంబసీ తెలిపింది. ఈ పరిస్థితుల్లో భారతీయులు తమ భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రయాణానికి అవసరమైన పాస్పోర్ట్, వీసా, టికెట్లు వంటి ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
అలాగే, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఎంబసీతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని కోరింది. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఎంబసీకి సమాచారం ఇవ్వాలని తెలిపింది. సాయం అవసరమైతే ఫోన్ నంబర్ల ద్వారా లేదా cons.tehran@mea.gov.in అనే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.
ఇప్పటివరకు ఎంబసీలో తమ వివరాలు నమోదు చేయని భారతీయులు తప్పనిసరిగా భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ కావాలని ఎంబసీ కోరింది. అలా చేస్తే అత్యవసర సమయాల్లో వారిని త్వరగా సంప్రదించి సహాయం అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.
మొత్తానికి, ఇరాన్లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, అందుకే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలు చేయకుండా వీలైనంత త్వరగా దేశం విడిచిపెట్టాలని ఇండియన్ ఎంబసీ మరోసారి హెచ్చరించింది.
అటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా ఇరాని ప్రభుత్వం పై మండిపడ్డాడు. ప్రభుత్వం చేస్తున్న దాడులు, కాల్పులు, ఉరిశిక్షలు వంటి పై ట్రంప్ చాలా సీరియస్ అవ్వడం జరిగింది. 31 రాష్ట్రాల వరకు ఈ నిరసనలు వ్యాపించాయి. చిన్నగా మొదలైన కూడా ఇప్పుడు ఆ దేశమంతా నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం కూడా నిరసనలు చేస్తున్న ప్రజలను చాలా హింసాత్మకంగా వారిపై చర్యలు తీసుకుంటుంది. ఎన్ని నిరసనలు ఎప్పుడు ముగిస్తాయో అని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు.
* ఇంతకీ ఈ నిరసనలు వెనకాల ఉన్నది ఆ దేశమేనా?
*నిరసనలు ఆగిపోవాలంటే ఏం చేయాలి?
* వీటికి సమాధానం తెలిస్తే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. fourth line news
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0