ఢిల్లీ ఎర్రకోట మెట్రో సమీపంలో కారు పేలుడు
ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సాయంత్రం 6.45 గంటల సమయంలో కారు పేలుడు సంభవించింది. ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి నగరాన్ని కుదిపేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న కారులో అకస్మాత్తుగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో అగ్నికీలలు చెలరేగి పలు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. పేలుడు ఒక కారులో చోటుచేసుకోవడంతో పక్కన ఉన్న వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
గేట్ నంబర్-1 వద్ద పార్క్ చేసి ఉన్న కారులో సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో భారీ పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఏడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు వెనుక ఉన్న నిజమైన కారణాలు ఇంకా బయటకు రాలేదు. ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్యనా? లేక అనుకోకుండా జరిగిన ప్రమాదమా? అనే దిశలో పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0