ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదం: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా రైళ్లు – దర్యాప్తు ప్రారంభం
ఛత్తీస్గఢ్లో రైలు ప్రమాదానికి ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడమే కారణమని అధికారులు చెబుతున్నారు. సిగ్నల్ ఫాల్ట్ లేదా మానవ తప్పిదం కారణమా అనే దానిపై దర్యాప్తు ప్రారంభమైంది.
ఛత్తీస్గఢ్లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడమే కారణమని ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. వేగంగా వస్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలును ఢీకొట్టడంతో బోగీలు ఒక్కదానిపైకి ఒకటి ఎక్కిపోయాయి.
ఈ ఘటనపై అధికారులు సిగ్నల్ ఫాల్ట్ కారణమా? లేక మానవ తప్పిదమా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలో రైల్వే సిబ్బంది, రక్షణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో నడిచే కొన్ని రైళ్లు రద్దు చేయగా, మరికొన్నింటిని మార్గం మళ్లించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0