తెలుగోడు వీరోచితం.. జైషే మొహ్మద్ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన IPS సందీప్

కర్నూలు IPS అధికారి సందీప్ చక్రవర్తి జైషే మొహ్మద్ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో అనుభవజ్ఞుడైన సందీప్ ఇప్పటికే ఆరు సార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు.

flnfln
Nov 12, 2025 - 10:47
 0  44
తెలుగోడు వీరోచితం.. జైషే మొహ్మద్ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన IPS సందీప్

కశ్మీర్‌లో ఉగ్రవాదులను కంట్రోల్ చేస్తూ ఎన్నో సాహసాలు చేసిన తెలుగు ఆఫీసర్ మరోసారి తన ప్రతిభ చూపించారు. కర్నూలుకు చెందిన 2014 బ్యాచ్ IPS అధికారి సందీప్ చక్రవర్తి జైషే మొహ్మద్ సంస్థ రూపొందించిన భారీ ఉగ్రకుట్రను సమయానికి గుర్తించి భగ్నం చేశారు.

గత నెలలో వివిధ ప్రాంతాల్లో జైషే మొహ్మద్ పోస్టర్లు కనిపించడంతో సందీప్ చక్రవర్తి దృష్టిలోపడ్డాయి. CC కెమెరా ఫుటేజీలను పరిశీలించి పాత ఉగ్ర కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురిని గుర్తించారు. వారిని రెండు వారాల పాటు విచారించగా, డాక్టర్ల పేరుతో రూపుదిద్దుకుంటున్న పెద్ద టెర్రర్ ప్లాన్ బయటపడింది.

కశ్మీర్‌లో ఇప్పటికే అనేక యాంటీ-టెర్రర్ ఆపరేషన్లలో పాల్గొన్న సందీప్ ఇప్పటివరకు ఆరు సార్లు ప్రెసిడెంట్ గౌరవ పతకాలు అందుకున్నారు. దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈ తెలుగోడు మరోసారి భారత గర్వంగా నిలిచారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
fln fln సమాజంలో జరిగే సమాచారానంతటిని రాసి పబ్లిష్ చేయడం. తెలుగు ఆంధ్ర నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ రాయడం. మన ఇండియాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరిగే అన్ని ట్రెండింగ్ న్యూస్ రాయడం.