నెల్లూరు జిల్లాలో కారుoపొడి లారీ ప్రమాదం – ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
నెల్లూరు జిల్లాలో కొడవలూరు మండలంలోని టపాతోపూ జాతీయ రహదారిపై కారం పొడి లారీ ప్రమాదానికి గురైంది. రోడ్డుపై కారం పొడి చెలరేగడంతో ప్రయాణికులు, ముఖ్యంగా టు వీలర్ రైడర్లు, కంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదానికి ప్రయాణికులు ఎంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొడవలూరు మండలం టపాతోపూ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారంపొడి లోడ్ గుంటూరు నుంచి చెన్నైకి వెళ్తున్న లారీని ఒక జెసిపి ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న కారం పొడి రోడ్డు మొత్తం అలుముకుంది. దీంతో ప్రయాణిస్తున్న టు వీలర్ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగింది. ప్రయాణికులు కళ్ళల్లో పడ్డ కారం పొడి వల్ల ఎంతో ఇబ్బంది పడటం జరిగింది. అధికారులు వెంటనే ఈ విషయాన్ని తెలుసుకొని రోడ్డుపైన వాటర్ ట్యాంక్ తో వాటర్ ని కొట్టించాలి అని ప్రణయకులు కోరుతూ ఉన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0