కర్ణాటక ప్రభుత్వం పదో తరగతి పాస్ మార్కులను 33 శాతానికి తగ్గింపు
కర్ణాటక ప్రభుత్వం పదవ తరగతి పాస్ మార్కులను 33 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మధు బంగారప్ప ఈ మార్పును అధికారికంగా ప్రకటించారు.
పూర్తి వివరాల్లోనికి వస్తే ;
పదవ తరగతి విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం బాగా వార్త అందించింది. పబ్లిక్ పరీక్షల్లో పాస్ మార్కుల నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ప్రతి విషయంలో కనీసం 33 మార్కులు సాధించిన వారే పాస్ అవ్వగలరని అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. కొంతమంది విద్యార్థులు 30 మార్కుల చుట్టూ ఉండి ఫెయిల్ అవ్వడంతో, వారి ఉన్నత విద్యకు అడ్డంకి ఏర్పడుతోందని భావించి ఈ చర్య చేపట్టినట్లు కర్ణాటక విద్యామంత్రిగా మధు బంగారప్ప చెప్పారు.
ఇప్పటివరకు పదో తరగతిలో పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సిన నిబంధన ఉండేది. కానీ ఒకటి లేదా రెండు మార్కుల కొరతతో ఫెయిలయ్యే విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ సమయంలో కొన్ని తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి పంపడం, ఆడపిల్లల కేసులో పెళ్లికి పంపడం జరుగుతుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప చెప్పారు. ఈ కారణంగా అనేక మంది విద్యార్థులు చదువును శాశ్వతంగా విడిచిపెట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పాస్ మార్కులను 33 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ మార్పు ఈ సంవత్సరం నుంచే అమలులోకి వస్తుంది మరియు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజాగా విధించిన కొత్త నియమాల ప్రకారం, ఈ విద్యా సంవత్సరం నుండి ఎస్ఎస్ఎల్సీ పరీక్షలో కనీసం 33 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు పాస్గా భావించబడతారు. మొత్తం 625 మార్కుల పరీక్షలో 33 శాతం అంటే 206 మార్కులు పొందిన వారు ఉత్తీర్ణులుగా గుర్తించబడతారు అని మంత్రి బంగారప్ప వివరించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0