ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై కీలక నిర్ణయాలకు వేదికగా CCS సమావేశం
ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ అధ్యక్షతన CCS సమావేశం ప్రారంభమైంది. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సీతారామన్, జైశంకర్, అజిత్ ధోవల్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.
చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హాజరయ్యారు.
భద్రతా సంస్థల నుంచి పేలుడు ఘటనపై సమగ్ర నివేదికను ప్రధానికి సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద నెట్వర్క్ను సమూలంగా నిర్మూలించేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా దేశంలో ప్రధాన భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ఈ కమిటీ సమావేశమవుతుంది.
Fourth Line News ద్వారా
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0