మొంథా తుఫాను నష్టం అంచనాకు ఏపీలో కేంద్ర బృందాల పర్యటన
మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో నష్టం అంచనా కోసం కేంద్ర బృందాలు నవంబర్ 10, 11 తేదీల్లో ఏపీలో పర్యటించనున్నాయి. ప్రకాశం నుంచి కోనసీమ వరకు పర్యటన – Fourth Line News.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటనకు ఏర్పాట్లు
మొంథా తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రెండు బృందాలను పంపుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో ఆ బృందాలు రాష్ట్ర పర్యటన చేపట్టనున్నాయి.
హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలో మొత్తం 8మంది అధికారులు రాష్ట్రానికి వస్తున్నారు. వీరు రెండు బృందాలుగా విడిపోయి ప్రకాశం, బాపట్ల, ఏలూరు, కృష్ణా, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పర్యటిస్తారు.
ఈ పర్యటనలో పంటల నష్టం, మౌలిక వసతుల ధ్వంసం, ఇళ్లు, రహదారులు, విద్యుత్ నష్టాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక నష్టం నివేదికను కేంద్రానికి పంపింది. ఈ బృందాల పరిశీలన అనంతరం ఆర్థిక సహాయం విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0