భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్గా విజయం
ఖమ్మం జిల్లా బోనకల్ పంచాయతీలో భార్య సర్పంచ్గా, భర్త ఉపసర్పంచ్గా ఎన్నికై రాజకీయ చరిత్ర సృష్టించారు. 932 ఓట్ల మెజార్టీతో బానోత్ జ్యోతి ఘన విజయం సాధించారు.
Main points :
1. ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా జరిగాయి.
2. బోనకల్ పంచాయతీలో భార్య సర్పంచ్గా గెలిచారు.
3. భర్త ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
4. బానోత్ జ్యోతి 932 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
5. రిజర్వేషన్ కారణంగా సతీమణిని బరిలో నిలిపారు.
6. ఈ ఘటన ఖమ్మం పరిసరాల్లో వైరల్గా మారింది.
Fourth Line News – బోనకల్ ప్రతినిధి కథనం: బోనకల్ ఫోర్త్ లైన్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్రంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భార్యాభర్తలే సర్పంచ్, సర్పంచ్ గా ఎన్నికవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఖమ్మంలో జోరుగా జరిగిన పంచాయతీలో ఊహించని విధంగా గెలుపులు ఓటములు రావడం విశేషం.
బోనకల్ పంచాయతీలో టిఆర్ఎస్ అభ్యర్థి బానోత్ జ్యోతి సర్పంచిగా గెలుపొందటము జరిగింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అయిన మంగమ్మపై 932 ఓట్లు మెజార్టీతో గెలవటము జరిగింది. అదే పంచాయతీలో జ్యోతి భర్త కొండ ఉపసర్పంచిగా ఏకాగ్రీవంగా ఎన్ని కవ్వడం ఒక విశేషంగా మారింది.
గత సంవత్సరంలో ఓటమిపాలైన కొండ ఈసారి రిజర్వేషన్ జనరల్ మహిళ కావడంతో సతీమణిని బరిలో నిలిపి సర్పంచ్ పీఠాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. గతంలో కూడా సిపిఎం తరపున జడ్పీటీసీగా గెలిచారు. ఇప్పుడు ఈ వార్త బోనకల్లు ఖమ్మం పరిసరాలలో వైరల్ అవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు ఉపసర్పంచ్, సర్పంచ్, గెలవడం పట్ల చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖమ్మంలో జరిగే ప్రతి వార్త మీరు ఫోర్త్ లైన్ న్యూస్ ద్వారా చదవవచ్చు. Fourth Line News – బోనకల్ ప్రతినిధి కథనం:
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0