కలుషిత నీటి విషాదం.. 23 మంది మృతి, మౌ ప్రాంతంలో 22 మంది అస్వస్థత
మధ్యప్రదేశ్లో కలుషిత నీటి వల్ల విషాదం చోటుచేసుకుంది. 23 మంది మృతి చెందగా, ఇండోర్ మౌ ప్రాంతంలో 22 మంది అనారోగ్యానికి గురయ్యారు. అధికారులు అప్రమత్తమయ్యారు.
* కలుషితమైన నీరు తాగి 23 మంది మృతి
* మౌ' ప్రాంతంలో 22 మంది అనారోగ్యం పాలయ్యారు
* వాంతులు, నిరసనలు, తీవ్రమైన కడుపు నొప్పితో వంటి లక్షణాలు
* 9 మందిని చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించగా...
* ఇంతకుముందు ఇద్దరు ప్రభుత్వ అధికారులను సస్పెండ్
fourth line news : మనం తాగే నీరు అసలు సురక్షితమైన, తాగే నీరు సురక్షితంగా లేకపోతే అసలు ఏం జరుగుతుందో తెలుసా. శుభ్రత లేని నీరు తాగి దాదాపుగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే భగీరత్పురప్రాంతంలో జరిగింద. ఈ సంఘటన మరువక మునుపే ఇంకొకటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది అనారోగ్య పాలయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జరిగింది. ఈ నీరు తాగిన వారు 9 మందిని చికిత్స నిమిత్తము ఆస్పత్రికి తరలించగా మిగిలిన వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ ఉన్నారు.
మౌ ' ప్రాంతంలోని బాధ్యతలు వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఏ ఈ ఘటన తెలుసుకున్న అక్కడి జిల్లా కలెక్టర్ శివం వర్మ ఆస్పత్రికి వెళ్లి బాధ్యతలు అందరిని పరామర్శించారు. ఆరోగ్యశాఖ బృందాలు ఆ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి సర్వే చేపడుతున్నాయి. నీటి సరఫరా చేస్తున్న లైన్ లో ఏమైనా లీకేజీలు ఉన్నాయా లేదా మరుగు నీరు చేరుతుందా అనే కోణాల్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
గతంలో కూడా ఇదే విధంగా నీరు కలుషితమై ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంలో ప్రభుత్వ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ ఇలాంటి ఘటనలు మరల పునరావృతం కావడంపై సానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరికీ అధికారులు నీటిని తప్పనిసరిగా మరిగించి తాగాలని పైపుల ద్వారా వచ్చే నీటిని నేరుగా తాగవద్దని సూచించారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. నీ పరిసరాలలో వస్తున్న వాటర్ ఎంత శుభ్రంగా ఉంది అనేది తెలియజేయండి?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0