అజిత్ పవార్ అంత్యక్రియలు నేడు.. మోడీ, అమిత్ షా, చంద్రబాబు హాజరు!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు నేడు ఉదయం 11 గంటలకు బారామతిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. పూర్తి వివరాలు చదవండి.
* మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అంత్యక్రియలు
* అంత్యక్రియలో PM మోడీ, అమిత్ షా
* సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్
* ఈరోజు ఉదయం 11 గంటలకు జరుగునున్నాయి
ఫోర్త్ లైన్ న్యూస్ ప్రతినిధి : అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో మరణించినట్టు మనందరికీ తెలిసిందే. ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది.
నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు 4 నలుగురు అక్కడికక్కడే మరణించారని విషయం మనందరికీ తెలిసిందే. అజిత్ పవార్ సొంత నియోజకవర్గం బారామతిలోని విద్య ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబోతున్నారు. ఆయన అంత్యక్రియలు కి పీఎం మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా. MH, పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరవుతున్నారు. ఇంకా పలువురు అధికారులు కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అధికారులు మరణించిన ఐదు కుటుంబాలకి సంతాపం తెలియజేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరణించడం ఆయన యొక్క అనుచరులు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు ఆయన యొక్క అంత్యక్రియలు ఘనంగా జరుగునున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0