విరాట్ కోహ్లీకి :సింహాద్రి అప్పన్న దర్శనం , అభిమానుల్లో జోష్ పెంచిన సెంచరీలు
విశాఖ సింహాచలం దేవస్థానంలో విరాట్ కోహ్లీ ప్రత్యేక దర్శనం, ఆలయ సంప్రదాయాల ప్రకారం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసిన విధానం, ఆలయ అధికారులు అందించిన ఘన స్వాగతం, సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో కోహ్లీ సాధించిన సెంచరీల వివరాలు.
* కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీలో దూసుకు వెళ్తున్నాడు
* ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలో ఉన్న ఆలయాన్ని
* ఆలయ సంప్రదాయాలు ప్రకారం విరాట్ కోహ్లీ
* ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు
* సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మ్యాచ్
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
fourth line news : విరాట్ కోహ్లీ సింహాద్రి అప్పన్న సేవలో. టీమిండియా స్టార్ క్రికెటర్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా సింహాచలం లోని సింహాద్రి అప్పన్న స్వామినే దర్శించుకోవడం జరిగింది. ఆలయ సంప్రదాయం ప్రకారం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన కోహ్లీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా సౌత్ ఆఫ్రికా జరిగిన వన్డే సిరీస్లో విరాట్ అద్భుతం గా ప్రదర్శన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అదే క్రమంలో సింహాద్రి అన్నప్ప స్వామిని దర్శించుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు.
సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మ్యాచ్లో మొదటి మ్యాచ్ టీమిండియా కైవసం చేసుకుంది. కానీ రెండో మ్యాచ్ మాత్రం టీమిండియా ఊడిపోయింది. సౌత్ ఆఫ్రికా రెండో మ్యాచ్లో చాలా బాగా ప్రదర్శన చేసి విజయాన్ని సాధించింది. ఈ రెండు వన్డే టెస్ట్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం అభిమానుల్ని ఎంతో ఆనందపరిచింది. అభిమానులు ఇంకా అనేక సెంచరీ చేయాలి అని భావిస్తున్నారు. ఈ వార్తపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.
Cricketer Virat Kohli visits Varaha Lakshmi Narasimha temple in Andhra's Simhachalam. pic.twitter.com/g0uUFHtkVz — News Arena India (@NewsArenaIndia) December 7, 2025
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0